లక్కీ వత్నాని గెలుపు

16 Mar, 2019 10:05 IST|Sakshi

ఆలిండియా ఓపె స్నూకర్‌ టోర్నమెంట్‌

ముంబై: సీసీఐ ఆలిండియా ఓపెన్‌ స్నూకర్‌ చాంపియన్‌ షిప్‌లో తెలంగాణ క్రీడాకారుడు లక్కీ వత్నాని మరో విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన రౌండ్‌–64 మ్యాచ్‌లో లక్కీ వత్నాని 4–1 (55–57, 73–8, 65–8, 61–53, 75–2)తో భారత నెం.4 ర్యాంకర్‌ కమల్‌ చావ్లాపై గెలుపొందాడు. ఇతర మ్యాచ్‌ల్లో టాప్‌ ప్లేయర్‌ పంకజ్‌ అద్వానీ (ఓఎన్‌ జీసీ) 4–0 (78–24, 65–4, 131(131)–0, 73(53)–22)తో మానవ్‌ పాంచల్‌పై, దివ్య శర్మ (హరియాణా) 4–1 (22–72, 54–43, 56–28, 77–17, 72(52)–29) పుష్పీందర్‌ సింగ్‌పై, గిరీశ్‌ (రైల్వేస్‌) 4–0 (65–31, 56–27, 62–37, 80(58)–0) హితేశ్‌ కొత్వానీ (ముంబై)పై, మోను చౌదరీ (ఢిల్లీ) 4–2 (44–58, 1–67(67), 70(54)–23, 75–37, 74–15, 84–42) షాబాజ్‌ ఆదిల్‌ఖాన్‌(ఓఎన్‌జీసీ)పై, రూపేశ్‌ షా (గుజరాత్‌) 4–3 (34–64, 61–6, 61–7, 45–61, 69–59, 50–60, 86(86)–60) సందీప్‌ గులాటి (ఢిల్లీ)పై, వరుణ్‌ మదన్‌ (ఢిల్లీ) 4–2 (81–42, 52–65, 73–38, 49–78, 60–28, 71–28) భరత్‌ సిసోడియా (మధ్యప్రదేశ్‌)పై, విమల్‌ మరివాలా (ముంబై) 4–3 (80(49)–9, 45–51, 52–39, 19–49, 62–63, 43–39, 50–29) వర్షా సంజీవ్‌ (కర్ణాటక)పై, దిలీప్‌ కుమార్‌ (రైల్వేస్‌)4–2 (68(47)–30, 68(54)–49, 54–60, 63–53, 50–62, 70–36) కనిష్క్‌ (ముంబై)పై, మనన్‌ చోప్రా (బీపీసీఎల్‌)4–1 (72–24, 70–12, 44–76, 94(63)–22, 75–40) ఎస్‌. అరుణ్‌ (కర్ణాటక)పై, మల్‌కీత్‌ సింగ్‌ (రైల్వేస్‌) 4–3 (83–12, 27–68, 1–86(86), 59–8, 1–69, 69–27, 74(60)–34) సౌరవ్‌ కొఠారి (ఓఎన్‌జీసీ)పై గెలుపొంది ముందంజ వేశారు.   

మరిన్ని వార్తలు