ధోని కేసు 13కు వాయిదా

6 Aug, 2014 01:40 IST|Sakshi

అనంతపురం లీగల్:  భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనిని మహావిష్ణువుగా చిత్రీకరిస్తూ బిజినెస్ టుడే కవర్‌పేజీపై ప్రచురించిన కేసును అనంతపురం షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రత్యేక న్యాయ స్థానం ఈనెల 13కు వాయిదా వేసింది.

బిజినెస్ టుడే మేగజైన్ తరఫు న్యాయవాది యజ్ఞదత్ దాఖలు చేసిన లిఖిత పూర్వక సమాధానాలపై మంగళవారం వాదనలు జరగాల్సి ఉంది. కానీ సమయం లేకపోవడంతో విచారణ చేపట్టలేకపోయిన న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది గోపాలరావు, ధోని తరఫు న్యాయవాది ఎం.విష్ణువర్ధన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు.
 

మరిన్ని వార్తలు