మెయిన్ డ్రాకు కృష్ణప్రసాద్

7 Feb, 2014 00:18 IST|Sakshi

 జింఖానా, న్యూస్‌లైన్: అఖిల భారత సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ టోర్నీలో అండర్-15 బాలుర సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు కృష్ణప్రసాద్ మెయిన్ డ్రాకు చేరుకున్నాడు. కడపలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్‌లో కృష్ణప్రసాద్ 15-10, 15-13తో హర్యానాకు చెందిన తరుణ్‌పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో శ్రీకృష్ణ సాయి కుమార్ 15-12, 15-12తో నవనీత్ (ఏపీ) పై నెగ్గగా... శ్రీ దత్తాత్రేయ రెడ్డి 15-10, 9-15, 15-12తో జయరాజ్ (అస్సాం)పై గెలిచాడు.
 
 అయితే మరో వైపు బషీర్ 12-15, 13-15తో ఆకాశ్ (బీహార్) చేతిలో, చంద్రజ్ పట్నాయక్ 12-15, 13-15తో అమన్ రైక్వార్ (మధ్యప్రదేశ్) చేతిలో పరాజయం పాలయ్యారు. బాలికల విభాగంలో షబానా బేగం 15-10, 15-13తో శివాని (కర్ణాటక)ని ఓడించి మెయిన్ డ్రాకు అర్హత సాధించింది.
 
 ఇతర ఫలితాలు: అండర్-13 బాలుర విభాగం: సాయి చరణ్ 15-10, 15-8తో  జయంత్ సిసోడియా (మధ్యప్రదేశ్)పై, అనిరుధ్ పర్వత రె డ్డి 15-7, 15-10తో భవ్య అగర్వాల్ (మహారాష్ట్ర)పై నెగ్గారు.
 
 అండర్-15 బాలుర డబుల్స్: వరప్రసాద్- ఎం తరుణ్ జోడి 21-13, 21-11తో సాయి రోహిత్-ఆకాశ్ చంద్రన్ జోడిపై, విష్ణువర్ధన్- శ్రీకృష్ణ సాయి కుమార్ జోడి 15-12, 16-14, 15-12తో నవనీత్-తరుణ్ కుమార్ జోడిపై గెలిచారు.
 

>
మరిన్ని వార్తలు