బీసీసీఐ కొత్త బాస్ శశాంక్ మనోహర్

3 Oct, 2015 21:35 IST|Sakshi
బీసీసీఐ కొత్త బాస్ శశాంక్ మనోహర్

ముంబై: బీసీసీఐ మాజీ చీఫ్ శశాంక్ మనోహర్ మరోసారి అధ్యక్ష పదవి పగ్గాలు చేపట్టనున్నారు. బోర్డు అధ్యక్షుడిగా మనోహర్ ఎన్నిక లాంఛనమే. బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరి రోజైన శనివారం నాటికి మనోహర్ ఒక్కరే రేసులో మిగిలారు. దీంతో ఆదివారం జరిగే బోర్డు ప్రత్యేక సాధారణ సమావేశంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

బీసీసీఐ చీఫ్ జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మరణంతో ఈ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నిక అనివార్యమైంది. దాల్మియా ఈస్ట్ జోన్కు చెందినవారు. బోర్డు నిబంధనల ప్రకారం దాల్మియా స్థానంలో ఈస్ట్ జోన్ క్రికెట్ సంఘాల ప్రతినిధి లేదా ఆ సంఘాలు బలపరిచిన వ్యక్తికి బోర్డు పగ్గాలు చేపట్టాలి. ఈస్ట్ జోన్లోని ఆరు క్రికెట్ సంఘాలూ మనోహర్కు మద్దతు తెలపడంతో బీసీసీఐ చీఫ్గా ఆయన ఎన్నికకు మార్గం సుగమమైంది.

మరిన్ని వార్తలు