భారత్కు ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్కు టి20 సిరీస్కు ముందు కూడా మరో ఎదురు దెబ్బ తగిలింది. గాయంతో చివరి వన్డేకు దూరమైన ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఇంకా కోలుకోలేదు. దాంతో అతను టి20 సిరీస్నుంచి కూడా తప్పుకున్నాడు. అతని స్థానంలో ఆల్రౌండర్ జిమ్మీ నీషమ్ను ఎంపిక చేసినట్లు కివీస్ బోర్డు వెల్లడించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ నెల 6, 8, 10 తేదీల్లో మూడు టి20 మ్యాచ్లు జరుగుతాయి.