టి20 జట్టులో మాథ్యూస్‌ రీఎంట్రీ

2 Jan, 2020 10:14 IST|Sakshi

కొలంబో: దాదాపు 16 నెలల విరామం తర్వాత ఆల్‌రౌండర్‌ ఎంజెలో మాథ్యూస్‌ శ్రీలంక టి20 జట్టులోకి వచ్చాడు. భారత్‌తో ఈనెల 5న మొదలయ్యే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే శ్రీలంక జట్టును బుధవారం ప్రకటించారు. 16 మంది సభ్యులుగల జట్టుకు లసిత్‌ మలింగ సారథ్యం వహిస్తాడు. 32 ఏళ్ల మాథ్యూస్‌ 2018 ఆగస్టులో చివరిసారి టి20 మ్యాచ్‌ ఆడాడు.  

శ్రీలంక టి20 జట్టు: మలింగ (కెప్టెన్‌), గుణతిలక, అవిష్క ఫెర్నాండో, ఎంజెలో మాథ్యూస్, దసున్‌ షనక, కుశాల్‌ పెరీరా,    డిక్‌వెల్లా, ధనంజయ డిసిల్వా, ఇసురు ఉడాన, భానుక రాజపక్స, ఒషాడా ఫెర్నాండో, వనిందు హసరంగ, లాహిరు కుమార, కుశాల్‌ మెండిస్, సందకన్, కసున్‌ రజిత.

>
మరిన్ని వార్తలు