ఫైనల్లో మయూర్, మేఘనాథన్

12 Dec, 2016 14:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: జీవీకే అఖిల భారత సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మయూర్ వసంత్, మేఘనాథన్ ఫైనల్‌కు చేరుకున్నారు. శనివారం జరిగిన 55 ఏళ్లు పైబడిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మయూర్ వసంత్ 6-1, 6-0తో వి. శంకర్‌పై గెలుపొందగా... ఎస్. మేఘనాథన్ 6-7(5), 7-6(3), 10-3తో వి. శ్రీనివాస్ రెడ్డిని ఓడించాడు. ప్లస్ 65 పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సి.ఆర్.గంగాధరన్ 6-2, 6-2తో పద్మాలు తటవర్తిపై, వి.ఆర్.కులకర్ణి 6-4, 6-4తో డి.ఎస్. రామారావుపై గెలిచి ఫైనల్‌కు చేరుకున్నారు. ప్లస్ 45 విభాగంలో నీలకంఠ్ 6-3, 6-1తో కె.వి.ఎన్.మూర్తిపై, ఎం. ఆర్ముగమ్ 6-0, 6-1తో ఆర్. మణికందన్‌పై నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించారు.       
 

మరిన్ని వార్తలు