క్వార్టర్స్‌లో మీడియా ఎలెవన్

28 Sep, 2014 01:15 IST|Sakshi
క్వార్టర్స్‌లో మీడియా ఎలెవన్

కార్పొరేట్ చాంపియన్స్ ట్రోఫీ
 సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో మీడియా ఎలెవన్ జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో మీడియా జట్టు 78 పరుగుల తేడాతో టీమ్ శాన్విస్ సీసీపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మీడియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. శ్రీనివాస్ (50) అర్ధసెంచరీ చేశాడు. రత్న (40) రాణించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ శాన్విస్ జట్టు 16.4 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌటైంది. శ్రీనివాస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వరుసగా మూడు లీగ్ మ్యాచ్‌ల్లోనూ గెలిచిన మీడియా జట్టు క్వార్టర్స్ పోరుకు అర్హత సంపాదించింది.



 

>
మరిన్ని వార్తలు