* అండర్సన్కు నాలుగు వికెట్లు
* ఇంగ్లండ్తో మూడో టెస్టు
షార్జా: ఇంగ్లండ్తో ఆదివారం ప్రారంభమైన మూడో టెస్టులో పాకిస్తాన్ జట్టు తడబడింది. పేసర్ అండర్సన్ (4/17) బౌలింగ్ను ఎదుర్కోలేక తక్కువ స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ మిస్బా ఉల్ హక్ (160 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో పాక్ తొలి ఇన్నింగ్స్లో 85.1 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 2 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. కుక్ (0 బ్యాటింగ్), మొయిన్ అలీ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో... టాస్ గెలిచి పాక్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో అజహర్ అలీ (0) నిరాశపర్చగా, మహ్మద్ హఫీజ్ (27), షోయబ్ మాలిక్ (38), యూనిస్ ఖాన్ (31) ఓ మాదిరిగా ఆడారు. ఇంగ్లిష్ పేసర్ల ధాటికి ఓ దశలో 116 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పాక్ను మిస్బా, సర్ఫరాజ్ (39)లు ఆరో వికెట్కు 80 పరుగులు జోడించి ఆదుకున్నారు. తర్వాత మిస్బా నిలకడగా ఆడినా.. రెండో ఎండ్లో లోయర్ ఆర్డర్ ఒత్తిడికి లోనైంది. దీంతో 118 పరుగుల తేడాతో చివరి 5 వికెట్లు చేజారాయి. బ్రాడ్, సమిత్ పటేల్, అలీ తలా రెండు వికెట్లు తీశారు.