భారత జట్లకు చేజారిన పతకం

27 Jun, 2017 02:23 IST|Sakshi
భారత జట్లకు చేజారిన పతకం

ప్రపంచ టీమ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత జట్లకు త్రుటిలో కాంస్య పతకాలు చేజారాయి. రష్యాలోని ఖాంటీ మన్‌సిస్క్‌లో సోమవారం ముగిసిన ఈ పోటీల్లో భారత మహిళల, పురుషుల జట్లు నాలుగో స్థానంలో నిలిచాయి. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో భారత మహిళల జట్టు 3–1తో అజర్‌బైజాన్‌పై... పురుషుల జట్టు 3–1తో నార్వేపై గెలిచాయి. ఓవరాల్‌గా ఈ టోర్నీలో మహిళల జట్టు 12 పాయింట్లు, పురుషుల జట్టు 11 పాయింట్లు సాధించాయి. మహిళల విభాగంలో రష్యా... పురుషుల విభాగంలో చైనా విజేతలుగా నిలిచాయి.

మరిన్ని వార్తలు