మిథాలీ రాజ్ మరో ఘనత

6 Jul, 2015 16:52 IST|Sakshi
మిథాలీ రాజ్ మరో ఘనత

బెంగళూరు: కెప్టెన్ మిథాలీ రాజ్ విజృంభణతో న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో వన్డేలో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2-2తో సిరీస్ ను సమం చేసింది. కివీస్ నిర్దేశించిన 221 పరుగుల టార్గెట్ ను ఇండియా టీమ్ 44.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేరుకుంది. మిథాలీ రాజ్ అజేయ అర్ధసెంచరీతో కదం తొక్కింది. 88 బంతుల్లో 10 ఫోర్లతో 81 పరుగులు చేసింది. ఈ క్రమంలో వన్డేల్లో 5 వేల పరుగుల మైలురాయిని అందుకుంది.

స్మృతి మంధన(66) అర్ధసెంచరీతో రాణించింది. కామిని 31, కౌర్ 32 పరుగులు చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 220  పరుగులకు ఆలౌటైంది. నిరంజన 3, గైక్వాడ్ 3, కౌర్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదు వన్డేల సిరీస్ లో రెండు టీములు రెండేసి మ్యాచ్ లు గెలిచాయి. చివరి మ్యాచ్ బుధవారం జరుగుతుంది.

మరిన్ని వార్తలు