ధోనికి రైనా సలహా

16 Feb, 2018 18:54 IST|Sakshi
ఎంఎస్‌ ధోని(ఫైల్‌ఫొటో)

న్యూఢిల్లీ:భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి సహచర క్రికెటర్‌ సురేశ్‌ రైనా సలహా ఇచ్చాడు.  ధోని మరింత రాణించాలంటే తన బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చుకోవాలని సూచించాడు. ఒకవేళ ధోని బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చుకుంటే మాత్రం మరిన్ని విలువైన పరుగులతో జట్టు విజయాలకు ఉపయోగపడతాడని రైనా అభిప్రాయపడ్డాడు. ' ధోని ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండి హిట్టింగ్‌ చేయాలంటే మాత‍్రం అతను బ్యాటింగ్‌ ఆర్డర్‌ ముందుకు రావాలి. అప్పుడు జట్టు మరింత పటిష్టంగా మారుతుంది. ధోనిలాంటి ఒక విలువైన ఆటగాడి సేవలు జట్టుకు చాలా అవసరం'అని రైనా పేర్కొన్నాడు. ధోని ఎక్కువగా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతూ మ్యాచ్‌ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నసంగతి తెలిసిందే.

దక్షిణాఫ్రికాతో జరిగే టీ 20 సిరీస్‌కు రైనా ఎంపికైన నేపథ్యంలో మరోసారి తెరపైకి వచ్చాడు. గత కొంతకాలంగా జట్టుకు దూరమైన రైనా.. ఈసారి వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని చూస్తున్నాడు. మిడిల్‌ ఆర్డర్‌లో తన బ్యాటింగ్‌తో సత్తా చాటి జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని యోచిస్తున్నాడు. ఫిబ‍్రవరి 18 నుంచి దక్షిణాఫ్రికా-భారత జట్ల మధ్య మూడు టీ 20ల సిరీస్‌ ఆరంభం కానుంది.

మరిన్ని వార్తలు