చెన్నై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ పునరాగమనం చేయబోతున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై తిరిగి ఐపీఎల్లో అడుగుపెట్టబోతుంది. ఈ మేరకు చెన్నైలో జరిగిన సూపర్కింగ్స్ ఫ్రాంచైజీ ప్రిఈవెంట్లో కెప్టెన్ ఎంఎస్ ధోని ఎమోషనల్ అయ్యాడు. సుదీర్ఘ విరామం అనంతరం ఐపీఎల్లో అడుగుపెట్టబోతున్న క్రమంలో ‘వుయ్ ఆర్ బ్యాక్.. వుయ్ ఆర్ బ్యాక్’ అంటూ తనకు చెన్నైతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు
'నేను ఎనిమిదేళ్లు చెన్నై సూపర్కింగ్స్కు ప్రాతినిథ్యం వహించా. నేను పుణె సూపర్ జెయింట్కు ఆడుతున్న సమయంలో యెల్లో కలర్కు దూరమయ్యా. అప్పుడు చాలా కఠినంగా అనిపించింది. అది గతం. ఇప్పుడు మనకు చాలా ముఖ్యమైనది కలిసి ముందుకు సాగడమే. ముఖాలపై చిరునవ్వుని చెదరకుండా ఈ సీజన్ ఐపీఎల్కు సిద్ధమవుదాం’ అని ధోని తన ప్రసంగంలో పేర్కొన్నాడు. అయితే స్పీచ్ ఇచ్చే క్రమంలో ధోని గొంతు బొంగురు పోవడంతో సురేశ్ రైనా వాటర్ బాటిల్ను అందించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.