ముంబై ఇండియన్స్‌ బుల్లి ఫ్యాన్‌ను చూశారా?

22 Jul, 2018 13:20 IST|Sakshi

ముంబై: ఇండియన్‌ ప‍్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఎంఎస్‌ ధోనిదే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆ ఫ్రాంచైజీతో ధోనికున్న అనుబంధం అటువంటి మరి. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో ధోని సారథ్యంలోని సీఎస్‌కే టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఫలితంగా ముచ్చటగా మూడోసారి సీఎస్‌కే ట్రోఫీని కైవసం చేసుకుంది.

ఐపీఎల్‌-11 జరిగే సమయంలో ధోని భార్య సాక్షి, కూతురు జీవాలు స్టాండ్స్‌ నుంచి సీఎస్‌కేకు చీర్స్‌ తెలుపుతూ జట్టు విజయాల్ని ఆస్వాదించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా, జీవా మాత్రం తమ జట్టుకు వీరాభిమాని అంటున్నాడు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. ఈ మేరకు ఐపీఎల్‌ సందర్భంగా  తమ జట్టుకు జీవా చీర్స్‌ తెలిపిన వీడియోను ట్వీటర్‌లో పోస్ట్‌ చేశాడు. దీనికి ‘మేము కొత్త అభిమానిని కలిగి ఉన్నాం’ అని క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు.

మరిన్ని వార్తలు