స్పాట్ ఫిక్సింగ్పై సుప్రీంకు ముద్గల్ కమిటీ నివేదిక

3 Nov, 2014 10:59 IST|Sakshi
స్పాట్ ఫిక్సింగ్పై సుప్రీంకు ముద్గల్ కమిటీ నివేదిక

న్యూఢిల్లీ : ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌పై జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ సోమవారం సుప్రీంకోర్టుకు తుది నివేదిక సమర్పించింది. మూడు నెలల విచారణ అనంతరం ఈ కమిటీ తన తుది నివేదికను న్యాయస్థానానికి సీల్డ్ కవర్లో అందించింది. ఈ కేసుపై ఈనెల 10న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బీసీసీఐ మాజీ చీఫ్‌, ఐసీసీ చైర్మన్‌ శ్రీనివాసన్‌తో పాటు టీఎన్‌సీఏ ప్రధాన కార్యదర్శి విశ్వనాథన్‌, క్యూ బ్రాంచ్‌ మాజీ ఎస్పీ సంపత్‌ కుమార్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అబాస్‌ కుమార్‌ను ముద్గల్ కమిటీ విచారించిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు