కింగ్స్ పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్

11 May, 2017 23:07 IST|Sakshi
కింగ్స్ పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్

ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా గురువారం ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత కింగ్స్ ను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరిన ముంబై ఇండియన్స్ కు ఇది నామమాత్రపు మ్యాచ్ కాగా, కింగ్స్ పంజాబ్ కు మాత్రం కీలక మ్యాచ్. ఈ మ్యాచ్ లో పంజాబ్ గెలిస్తేనే నాకౌట్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంటుంది.

 

ఒకవేళ ఓటమి పాలైతే మాత్రం కింగ్స్ పంజాబ్ కు దారులు మూసుకుపోయినట్లే. దాంతో అమీతుమీ తేల్చుకునేందుకు కింగ్స్ పంజాబ్ సన్నద్ధమైంది. చివరిమ్యాచ్‌లో కోల్‌కతాపై విజయం సాధించి ఉత్సాహంలో ఉన్న పంజాబ్‌ అదేజోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓటమితో కంగుతున్న ముంబై తిరిగి విజయాల బాట పట్టాలని కృత నిశ్చయంతో ఉంది.


కింగ్స్ పంజాబ్ తుది జట్టు: మ్యాక్స్ వెల్(కెప్టెన్), మనన్ వోహ్రా, మార్టిన్ గప్టిల్, షాన్ మార్ష్, వృద్ధిమాన్ సాహా, అక్షర్ పటేల్, రాహుల్ తెవాతియా, మ్యాట్ హెన్రీ, మోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, సందీప్ శర్మ

ముంబై ఇండియన్స్ తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, లెండిల్ సిమన్స్, పార్ధీవ్ పటేల్, నితీశ్ రానా, కీరన్ పొలార్డ్, కరణ్ శర్మ, హర్భజన్ సింగ్, మెక్లీన్గన్, జస్ప్రిత్ బూమ్రా, లసిత్ మలింగా


 

మరిన్ని వార్తలు