ముంబై: ఐపీఎల్-8లో భాగంగా ఆదివారం రాత్రి ఇక్కడ జరుగుతున్న మ్యాచ్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ 178 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్కు నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.
పంజాబ్ ఓపెనర్లు సెహ్వాగ్, మురళీ విజయ్ రాణించారు. డాషింగ్ బ్యాట్స్మన్ వీరేంద్ర సెహ్వాగ్ చాలా రోజుల తర్వాత మెరుపులు మెరిపించాడు. సెహ్వాగ్ 19 బంతుల్లో 6 పోర్లు, సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. మురళీ విజయ్ 35, డేవిడ్ మిల్లర్ 24 పరుగులు చేశారు. చివర్లో పంజాబ్ కెప్టెన్ జార్జి బెయిలీ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. బెయిలీ (32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 నాటౌట్) సూపర్ హాఫ్ సెంచరీ చేశాడు. ముంబై బౌలర్లు మలింగ, హర్భజన్ రెండేసి వికెట్లు తీశారు.