-

బెంగళూరుకు మన్‌దీప్

6 Feb, 2015 00:33 IST|Sakshi

బెంగళూరు: పంజాబ్ కింగ్స్ ఎలెవ న్ బ్యాట్స్‌మన్ మన్‌దీప్ సింగ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తీసుకుంది. దీంతో ఈ సీజన్‌లో తను బెంగళూరు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ మ్యాచ్‌ల్లో ఈ ఆటగాడు నిలకడగా రాణిస్తున్నాడు.
 
 తనతో పాటు రాజస్తాన్ నుంచి బౌలర్ ఇక్బాల్ అబ్దుల్లాను కూడా బెంగళూరు టీమ్ తీసుకుంది. శుక్రవారంతో ఈ రెండో ట్రేడింగ్ విండో ముగియగా.. ఇప్పటిదాకా ఆరుగురు ఆటగాళ్లు ట్రేడింగ్‌లో తమ పాత జట్ల నుంచి మారారు.
 

మరిన్ని వార్తలు