సానియాకు మోడీ అభినందనలు

7 Sep, 2014 11:56 IST|Sakshi
సానియాకు మోడీ అభినందనలు

న్యూఢిల్లీ: యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ఈ విజయం గర్వకారణమని మోడీ ప్రశంసించారు. ఇందుకు ప్రతిగా సానియా మోడీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కూడా సానియాకు అభినందించారు.

యూఎస్ ఓపెన్లో బ్రెజిల్ ఆటగాడు బ్రూనో సోర్స్తో జతకట్టిన సానియా మిక్స్డ్ డబుల్స్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ వచ్చిన సానియాకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.

మరిన్ని వార్తలు