పారా అథ్లెట్లకు ప్రధాని అభినందన

23 Sep, 2016 01:25 IST|Sakshi
పారా అథ్లెట్లకు ప్రధాని అభినందన

న్యూఢిల్లీ: రియో పారాలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అథ్లెట్లు గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. పతకాలు సాధించిన నలుగురు ఆటగాళ్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ‘పారాలింపిక్స్‌లో దేశం గర్వించే విధంగా చేసిన అథ్లెట్లను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అలాగే ప్రతీ అథ్లెట్‌తో ఆయన ఫొటో దిగి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 19 మందితో కూడిన బృందం రెండు స్వర్ణాలు, ఓ రజతం, కాంస్యం సాధించిన విషయం తెలిసిందే
 

మరిన్ని వార్తలు