అంధుల క్రికెట్ జట్టుకు మోదీ బ్యాట్

28 Feb, 2017 14:26 IST|Sakshi
ఢిల్లీ: ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన అంధుల క్రికెట్ జట్టు సభ్యులు మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసారు. ఈ సందర్భంగా మోదీ వారిని అభినందించారు. ఇలాంటి విజయాలు భవిష్యత్తులో మరిన్ని సాధించాలని ఆకాక్షించారు. టీం సభ్యులు ఆటోగ్రాఫ్ లతో కూడిన బ్యాట్, బాల్, మోదీ పేరు గల జెర్సీని మోదీకి అందజేశారు. మోదీ కూడా తన సంతకం గల బ్యాట్, బంతిని జట్టు సభ్యులకు కానుకగా ఇచ్చారు. గత నెల 8న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ గెలిచిన విషయం తెలిసిందే.
మరిన్ని వార్తలు