పెళ్లికి ఒప్పుకోని ప్లేయర్‌.. రూంలో వేసి లాక్‌!

14 Feb, 2018 09:16 IST|Sakshi

హర్యానా: జాతీయ స్థాయి మహిళ కబడ్డీ ప్లేయర్‌ హర్యానా మహిళ కమిషన్‌ను కలిసింది. ఆమె రోహ్‌తక్‌ జిల్లా నుంచి ఎంపిక అయ్యింది. తన తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నారని మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. 

‘పెళ్లికి నేను  నిరాకరించాను. అందుకే వారు నన్ను ఒక గదిలో పెట్టి బీగం వేశారు. నా చదువును, ఆటలను ఇంకా కొనసాగించాలని ఉంది’ అని ఆమె మహిళ కమిషన్‌ ముందు తన బాధలను తెలిపింది. 

మరిన్ని వార్తలు