నేటి నుంచి రగ్బీ టోర్నమెంట్‌

1 Feb, 2020 10:05 IST|Sakshi

హైదరాబాద్‌: భారత రగ్బీ ఫుట్‌బాల్‌ యూనియన్‌ (ఐఆర్‌ఎఫ్‌యూ) ఆధ్వర్యంలో తెలంగాణ రగ్బీ సంఘం సహకారంతో నేటి నుంచి జాతీయ సబ్‌ జూనియర్‌ రగ్బీ చాంపియన్‌షిప్‌ జరగనుంది. జింఖానా మైదానంలో రెండు రోజుల పాటు ఈ పోటీలను నిర్వహించనున్నట్లు శుక్రవారం సోమా జిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఆర్‌ఎఫ్‌యూ ప్రతినిధి సందీప్‌ తెలిపారు.

గతంలో రెండు సార్లు హైదరాబాద్‌లోనే ఈ పోటీలను నిర్వహించామని, ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఈసారి కూడా ఇక్కడే టోర్నీని జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇందులో 21 రాష్ట్రాలకు చెందిన 670 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని చెప్పారు. 15 నిమిషాల పాటు జరిగే మ్యాచ్‌లో తొలి 7 నిమిషాల తర్వాత ఒక నిమిషం విరామం ఉంటుందన్నారు. ప్రతీ జట్టుకు ఏడుగురు క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు.    

మరిన్ని వార్తలు