భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ అమెరికాలో జరిగిన యూనివర్సిటీ గేమ్స్లో మెరిశాడు. నేషనల్ కాలేజియేట్ అథ్లెటిక్ అసోసియేషన్ (ఎస్సీఏఏ) ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో 19 ఏళ్ల తేజస్విన్ హైజంప్లో స్వర్ణం నెగ్గాడు. కాన్సస్ యూనివర్సిటీ తరఫున బరిలోకి దిగి 2.24 మీటర్లతో విజేతగా నిలిచాడు.