హామిల్టన్ : భారత మహిళలతో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్లో ఆతిథ్య న్యూజిలాండ్ 162 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కివీస్కు ఓపెనర్ సోఫి డెవిన్ (72: 52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీతో మంచి శుభారంభం అందించగా.. కెప్టెన్ అమీ సట్టెర్వైట్ (31), సుజీ బెట్స్(23)లు రాణించారు. దీంతో ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తీ శర్మకు రెండు వికెట్లు దక్కగా.. మాన్సీ జోషి, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్లకు తలో వికెట్ దక్కింది.