దక్షిణాఫ్రికా శుభారంభం

1 Oct, 2018 05:46 IST|Sakshi

కింబర్లి: జింబాబ్వేతో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్‌లో బౌలర్లు రాణించడంతో దక్షిణాఫ్రికా జట్టు శుభారంభం చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో సఫారీ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 34.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ మసకద్జా (25; 4 ఫోర్లు), చిగుంబురా (27; 4 ఫోర్లు) మినహా మిగతావారు పూర్తిగా విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో ఇన్‌గిడి 3, రబడ, ఫెలుక్వాయో, ఇమ్రాన్‌ తాహిర్‌ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సఫారీ జట్టు 26.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసి గెలిచింది. క్లాసెన్‌ (44; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. జింబాబ్వే బౌలర్లలో చటారా, వెల్లింగ్టన్‌ మసకద్జాలకు చెరో రెండు వికెట్లు దక్కాయి. ఇన్‌గిడికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం జరుగనుంది. 

మరిన్ని వార్తలు