సహారా అధికారికంగా చెప్పలేదు: బీసీసీఐ

26 Jun, 2013 17:38 IST|Sakshi
సహారా అధికారికంగా చెప్పలేదు: బీసీసీఐ

 ముంబై: ఐపీఎల్ నుంచి పుణే వారియర్స్ జట్టు తప్పుకుంటున్నట్లు ఆ టీమ్ ఫ్రాంచైజీ సహారా ఇండియా బహిరంగంగా ప్రకటించి చాలా రోజులే అయింది. అయితే ఇప్పటి వరకు బీసీసీఐకి సహారా అధికారికంగా ఎలాంటి లేఖ రాయలేదని సమాచారం. వచ్చే సెప్టెంబరులో జరిగే బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో దీనిపై చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. ‘ప్రస్తుతానికి ఈ అంశంపై స్తబ్దత కొనసాగుతోంది.
 
  అయితే సహారా ఇప్పటి వరకు మాకు అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మరోవైపు బోర్డు మేనేజ్‌మెంట్ మారితే ఐపీఎల్‌లో కొనసాగే అంశాన్ని కూడా పరిశీలిస్తామని కూడా వారు చెప్పారు. కాబట్టి చర్చలు కొనసాగుతున్నాయనే అర్థం. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు’ అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. వివాదాలకు తావు లేకుండా ప్రతీ ఫ్రాంచైజీతో తమ అనుబంధం కొనసాగించాలనే బోర్డు భావిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు