అర్జున అవార్డుకు మనిక, హర్మీత్‌ల పేర్లు ప్రతిపాదన

21 Apr, 2018 01:11 IST|Sakshi

గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో నాలుగు పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) క్రీడాకారిణి మనిక బాత్రా, హర్మీత్‌ దేశాయ్‌ పేర్లను భారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ) అర్జున అవార్డుకు సిఫారసు చేసింది. ‘గోల్డ్‌కోస్ట్‌లో మనిక, హర్మీత్‌లు అద్భుత ప్రదర్శన చేశారు.

అందుకే అర్జున అవార్డు కోసం వారి పేర్లను సూచించాం. తుది ఎంపిక విషయంలో ప్రభుత్వ కమిటీకి మనిక పేరు విస్మరించడం చాలా కష్టం’ అని టీటీఎఫ్‌ఐ అధికారి తెలిపారు.    

మరిన్ని వార్తలు