హరికృష్ణ సంచలనం

27 Apr, 2016 01:33 IST|Sakshi
హరికృష్ణ సంచలనం

స్టావెంజర్ (నార్వే): నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ సంచలనం సృష్టించాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్ అనీశ్ గిరి (నెదర్లాండ్స్)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 36 ఎత్తుల్లో విజయం సాధించాడు. ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌తోపాటు వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా), తొపలోవ్ (బల్గేరియా), అరోనియన్ (అర్మేనియా), మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్)లాంటి మేటి గ్రాండ్‌మాస్టర్లు ఈ టోర్నీ బరిలో ఉన్నారు. ఆరో రౌండ్ తర్వాత హరికృష్ణ 3.5 పాయింట్లతో  మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటిదాకా హరికృష్ణ ఆరు గేమ్‌లు ఆడి మూడింటిని ‘డ్రా’ చేసుకొని, రెండింటిలో గెలిచి, మరో గేమ్‌లో ఓడిపోయాడు.

>
మరిన్ని వార్తలు