భళా... భారత్

12 Jun, 2016 04:03 IST|Sakshi
భళా... భారత్

బ్రిటన్‌పై 2-1తో విజయం
లండన్: ఒలింపిక్ చాంపియన్ జర్మనీపై చివరి నిమిషాల్లో విజయాన్ని చేజార్చుకొని ‘డ్రా’తో సంతృప్తి పడ్డ భారత్... రెండో మ్యాచ్‌లో మాత్రం ఆ పొరపాటు చేయలేదు. ప్రపంచ నాలుగో ర్యాంకర్ బ్రిటన్‌తో శనివారం జరిగిన చాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2-1 గోల్స్‌తో నెగ్గి సంచలనం సృష్టించింది. భారత్ తరఫున మన్‌దీప్ సింగ్ (17వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (34వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా..

యాష్లే జాక్సన్ (35వ నిమిషంలో) బ్రిటన్‌కు ఏకైక గోల్ అందించాడు. సోమవారం జరిగే మూడో మ్యాచ్‌లో బెల్జియంతో భారత్ తలపడుతుంది.

మరిన్ని వార్తలు