సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జూన్ 23న నగరంలో ‘ఒలింపిక్ డే రన్’ జరుగనుంది. ఫతే మైదాన్ క్లబ్లో ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులు, ఇతర క్రీడా సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జంట నగరాల్లో జూన్ 23న, తెలంగాణ ఇతర జిల్లాల్లో జూన్ 21న ఒలింపిక్ డే రన్ను నిర్వహించాలని నిర్ణయించారు.
నగరంలో చాదర్ఘాట్లోని విక్టరీ ప్లేగ్రౌండ్, వైఎంసీఏ హైదరాబాద్, సికింద్రాబాద్ గాంధీ విగ్రహం, బోయిన్పల్లి, చార్మినార్, మెహదీపట్నం ప్రాంతాల నుంచి రన్ ప్రారంభమవుతుందని అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కె. రంగారావు తెలి పారు. క్రీడాభిమానులంతా రన్ను విజయ వంతం చేయాలని ఆయన కోరారు.