మనోళ్లలో మెరిసింది ముగ్గురే

15 Feb, 2015 14:09 IST|Sakshi
మనోళ్లలో మెరిసింది ముగ్గురే

అరివీర భయంకరులైన బ్యాట్స్మెన్.. మహీందర్ సింగ్ ధోనీ లాంటి అద్భుతమైన స్ట్రైకర్.. వీళ్లంతా ఉన్నా కూడా భారత జట్టులో మెరిసిన బ్యాట్స్మెన్ మాత్రం ముగ్గురంటే ముగ్గురే. చాలా కాలంగా ఫాం లేక ఇబ్బంది పడుతున్న శిఖర్ ధవన్ 73, సురేష్ రైనా 74 పరుగులు చేయగా, యువ టీమిండియా ఆపద్బాంధవుడు విరాట్ కోహ్లీ 107 పరుగులు చేసి సెంచరీతో మెరిశాడు.

ఈ ముగ్గురు కలిసే 254 పరుగులు చేస్తే.. మిగిలిన వాళ్లంతా కలిసి 46 పరుగులు మాత్రమే చేసినట్లయింది. అది కూడా ఎక్స్ట్రాలతో కలిపి. ఓపెనర్ రోహిత్ శర్మ 15 పరుగులు, కెప్టెన్ ధోనీ 18 పరుగులు, రవీంద్ర జడేజా 3 పరుగుల వంతున మాత్రమే చేశారు. చివరి 5-10 ఓవర్లలో రన్రేట్ పెంచుకోవాల్సింది పోయి.. పూర్తిగా చేతులెత్తేయడంతో ఒక దశలో 330 పరుగులు దాటుతుందనుకున్న టీమిండియా స్కోరు 300 వద్ద మాత్రమే ఆగిపోయింది.

మరిన్ని వార్తలు