► 22 ఓవర్లకు 122/1
కార్డిఫ్: చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్-పాక్ మధ్య జరుగుతున్న తొలి సెమీస్లో పాక్ విజయం దిశగా దూసుకెళ్తుంది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్, ఓపెనర్లు అజార్, ఫకార్లు అర్ధ సెంచరీలతో చెలరేగడంతో 22 ఓవర్లకు ఒక వికెట్ నష్టపోయి 122 పరుగులు చేసింది. తొలుత 49 బంతుల్లో ఫకార్ అర్ద సెంచరీ చేయగా, అజార్ 68 బంతుల్లో సాధించాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతుండటంతో పాక్ లక్ష్యం చిన్నబోయింది. 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫకార్ అవుటయ్యాడు. క్రీజులో అజార్, బాబర్ ఉన్నారు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్కు చేసిన ఇంగ్లండ్ పాక్ బౌలర్ల దాటికి 211 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బ్యాట్స్మన్లో బెయిర్ స్టో(43), జోరూట్ (46), బెన్ స్టోక్స్(34), మోర్గాన్(33)లు విఫలమవ్వడంతో ఇంగ్లండ్ పాక్కు స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది. పాక్ బౌలర్లలో హసన్ అలీ (3), రుమాన్ రయీస్ (2,) జునైద్ ఖాన్ (2), షదాబ్ ఖాన్ (1) లకు వికెట్లు దక్కాయి.