జింబాబ్వేలో పాక్ పర్యటన రద్దు

26 Jul, 2015 00:42 IST|Sakshi

కరాచీ: వచ్చే నెలలో తమ జింబాబ్వే పర్యటనను పాకిస్తాన్ జట్టు రద్దు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఆ జట్టుతో పాక్ మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఇరు దేశాల బోర్డుల అంగీకారంతో ఈ సిరీస్ రద్దయినట్టు సమాచారం. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారి ఒకరు ధృవీకరించారు. ‘టూర్ రద్దు విషయం నిజమే. ఈ సిరీస్‌కు స్పాన్సర్‌ను సంపాదించడంలో జింబాబ్వే బోర్డుకు సమస్యలు ఎదురవుతున్నాయి’ అని చెప్పారు.
 

మరిన్ని వార్తలు