శ్రీలంక 271 ఆలౌట్‌

21 Dec, 2019 02:46 IST|Sakshi

షాహిన్‌ అఫ్రిదికి 5 వికెట్లు

కరాచీ: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంకకు 80 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 64/3తో ఆట కొనసాగించిన లంక తమ మొదటి ఇన్నింగ్స్‌లో 271 పరుగులకు ఆలౌటైంది. దినేశ్‌ చండిమాల్‌ (74) అర్ధ సెంచరీతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, దిల్‌రువాన్‌ పెరీరా (48) రాణించాడు. పాక్‌ యువ పేస్‌ బౌలర్‌ షాహిన్‌ అఫ్రిది 77 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా, మరో పేసర్‌ అబ్బాస్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాకిస్తాన్‌ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి వికెట్‌ కోల్పోకుండా 57 పరుగులు చేసింది. ఆబిద్‌ అలీ (32 బ్యాటింగ్‌), షాన్‌ మసూద్‌ (21 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు.

మరిన్ని వార్తలు