లెజెండ్స్‌కు పాక్‌ క్రికెటర్‌ ధన్యవాదాలు

20 Jun, 2017 18:07 IST|Sakshi
లెజెండ్స్‌కు పాక్‌ క్రికెటర్‌ ధన్యవాదాలు

పాకిస్తాన్‌ ఓపెనర్‌ అజార్‌ అలీ  ఇండియా క్రికెటర్లపై ఒక అద్భుతమైన ట్వీట్‌ చేశాడు. అలీ క్రికెట్‌ లెజెండ్స్‌ అయినా ధోని, విరాట్‌ కోహ్లీ, యువరాజ్‌ సింగ్‌లకు తన ట్వీట్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపాడు. ఐసీసీ ఛాంపియన్‌ ట్రోఫీ పైనల్‌ తర్వాత ఈ ముగ్గురితో తన కుమారులు ఫోటోలు దిగారు.

తమ సమయాన్ని ఫోటోలు దిగేందుకు కేటాయించినందుకు  అలీ చాలా సంతోషంగా ఉన్నాడు.  తన కుమారులు సంతోషంగా ఉన్నారని అన్నారు. కొద్దిసేపటి క్రితం పోస్ట్‌ చేసినప్పటి నుంచి ఇప్పటికే  దాదాపుగా 4700 లైక్స్‌ కొట్టారు. ఈ ట్వీట్‌కు 2300 రిట్వీట్స్‌ వచ్చాయి.  అలీ తన కుమారులు  లెజెండ్స్‌తో దిగిన ఫోటోలను ట్వీటర్‌లో పెట్టాడు.

మరిన్ని వార్తలు