తృటిలో చేజారిన కాంస్యం

17 Sep, 2016 01:50 IST|Sakshi
తృటిలో చేజారిన కాంస్యం

రియో డి జనీరో: పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ అమిత్ కుమార్ సరోహ తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. శుక్రవారం జరిగిన ఎఫ్51 క్లబ్ త్రో ఈవెంట్‌లో 31 ఏళ్ల  ఈ హరియాణా పారా అథ్లెట్ 26.63మీ. దూరం విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు. స్లొవేకియాకు చెందిన మరియన్ కురేజ 26.82మీ. విసిరి కాంస్యం సాధించాడు. వీరిద్దరి మధ్య దూరం కేవలం 0.19మీ. మాత్రమే. తొలి స్థానంలో నిలిచిన జెల్జికో దిమిత్రిజెవిక్ (29.96మీ) ప్రపంచ రికార్డును సృష్టించాడు.

మరిన్ని వార్తలు