ప్రిక్వార్టర్స్‌లో గురుసాయిదత్‌

29 Mar, 2018 05:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓర్లీన్స్‌ మాస్టర్స్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ఆటగాళ్లు గురుసాయిదత్, పారుపల్లి కశ్యప్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో గురుసాయిదత్‌ 21–12, 24–22తో కాయ్‌ షాఫెర్‌ (జర్మనీ)పై గెలుపొందగా... కశ్యప్‌ 21–16, 21–7తో దుర్కిన్‌జాక్‌ (క్రొయేషియా)ను ఓడించాడు. హైదరాబాద్‌కే చెందిన మరో ప్లేయర్‌ చిట్టబోయిన రాహుల్‌ యాదవ్‌ రెండో రౌండ్‌లో 23–25, 13–21తో లుకాస్‌ క్లియర్‌బౌట్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓటమి చవిచూశాడు.  

మరిన్ని వార్తలు