నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా: కశ్యప్‌

18 Dec, 2019 08:54 IST|Sakshi

‘ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత అద్భుతమైన మహిళవు నువ్వు. మంచి భార్య రావాలని నేను ఏనాడు కోరుకోలేదు. మనం ఒక్కటై గడిచిన.. ఈ ఏడాదిని అద్భుతంగా మలిచినందుకు నీకు ధన్యవాదాలు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. పెళ్లిరోజు శుభాకాంక్షలు’ అంటూ భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పారుపల్లి కశ్యప్‌ తన భార్య, స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై ప్రేమ చాటుకున్నాడు. మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తామిద్దరం కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ఈ క్రమంలో సైనా- కశ్యప్‌లకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సైనా సైతం తమ మొదటి పెళ్లిరోజును పురస్కరించుకుని... భర్తతో కలిసి కేక్‌ కట్‌ చేస్తున్న ఫొటోలను షేర్‌ చేశారు.

కాగా దాదాపు పదేళ్లపాటు తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచిన సైనా- కశ్యప్‌ గతేడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రాయదుర్గంలోని సైనా నివాసం ఓరియన్‌ విల్లాలో ఈ రాకెట్‌ స్టార్స్‌ రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. అత్యంత నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమానికి ఇరువైపుల బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అనంతరం సినీ, క్రీడా ప్రముఖుల కోసం ఈ జంట నోవాటెల్‌లో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేసింది. ఇక భారత బ్యాడ్మింటన్‌లో స్టార్‌గా ఎదిగిన సైనా.. ఈ విభాగంలో భారత్‌కు ఒలింపిక్‌ పతకం అందించిన తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచారు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి ఈ ఘనత దక్కించుకున్నారు. అంతేగాకుండా ప్రపంచ బ్మాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నారు.

ఈ క్రమంలో సైనా జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌ పరిణీతి చోప్రా సైనాగా అలరించనున్నారు. కాగా పారుపల్లి కశ్యప్‌ సైతం కీలక మ్యాచుల్లో విజయం సాధించి క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. ఇక వీరిద్దరు పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ నుంచి క్రీడా ప్రస్థానం మొదలుపెట్టారన్న సంగతి తెలిసిందే.

You are simply the most amazing woman in the world. I couldn’t ask for a better wife. Thanks for making the first year together so wonderful. I love you so much. Happy anniversary!! 😘😘❤️

A post shared by Kashyap Parupalli (@parupallikashyap) on

మరిన్ని వార్తలు