కరాచీ:ఇటీవల పాకిస్తాన్ స్టార్ స్పిన్నర్ ను సస్పెండ్ చేస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) అప్పీల్ కు వెళ్లనుంది. గతేడాది నవంబర్ లో ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ సందర్భంగా యాసిర్ నిషేధిత ఉత్పేరకాలు వాడినట్లు డోప్ టెస్టులో వెల్లడి కావడంతో అతనిపై ఐసీసీ సస్పెన్షన్ వేటు వేసింది.
కాగా, ఆ నిర్ణయంపై తిరిగి అప్పీల్ వెళ్లే అవకాశం ఉన్నందున దానిపై పీసీబీ దృష్టి సారించింది. ఈ మేరకు వైద్య నిపుణుల సలహాతో ముందుకు వెళ్లుతున్నట్లు పీసీబీ అధికారి ఒకరు తాజాగా పేర్కొన్నారు. యాసిర్ తీసుకున్న క్లోర్ టేలిడాన్ అనే మాత్ర ఉద్దేశపూర్వకంగా తీసుకున్నది కాదని, అతనికి రక్తపోటు ఉన్న కారణంగానే ఆ మాత్రను వాడాల్సి వచ్చిందనేది పీసీబీ తన వాదనలో ప్రధానంగా వినిపించనుంది. మరోవైపు యాసిర్ కు తామంతా అండగా ఉంటామని పీసీబీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నజామ్ సేథీ స్పష్టం చేశారు.అతన్ని నిషేధం నుంచి బయటపడేయడానికి తమశాయశక్తులా కృషి చేస్తామని ఆయన తెలిపారు.