ఫలక్, రిత్విక్‌లకు టైటిల్స్

7 Nov, 2016 10:34 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఫలక్, రిత్విక్‌లు టైటిల్స్‌ను కై వసం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో క్యాడెట్ బాలికల ఫైనల్లో ఫలక్ (జీఎస్‌ఎం) 7-11, 7-11, 11-4, 11-9, 12-10తో ఫాతిమా (స్టాగ్ అకాడమీ)పై గెలుపొందగా... బాలుర విభాగంలో రిత్విక్ (స్టాగ్ అకాడమీ) 11-9, 11-3, 9-11, 11-9తో రాజు (ఏడబ్ల్యూఏ)పై విజయం సాధించారు.

 

జూనియర్ బాలబాలికల ఫైనల్లో సరోజ్ సిరిల్ (జీటీటీఏ) 7-11, 11-8, 11-4, 11-9, 11-4తో అరవింద్ (ఏడబ్ల్యూ)పై, సస్య (ఏడబ్ల్యూఏ) 9-11, 11-6, 11-9, 7-11, 11-6, 8-11, 11-1తో ప్రణీత (హెచ్‌వీఎస్)పై గెలుపొందారు. సబ్ జూనియర్ బాలుర  ఫైనల్లో వరుణ్ శంకర్ (జీటీటీఏ) 11-8, 11-7, 9-11, 11-5, 8-11, 11-5తో సారుు వెంకట ధనుష్ (ఏడబ్ల్యూఏ)పై, బాలికల ఆయుషి (జీఎస్‌ఎం) 11-5, 11-4, 11-2, 11-5తో అంజలి (జీఎస్‌ఎం)పై విజయం సాధించారు. యూత్ బాలికల ఫైనల్లో ప్రణీత (హెచ్‌వీఎస్) 9-11, 4-11, 11-6, 11-8, 11-9, 11-7తో సస్య (ఏడబ్ల్యూఏ)పై... బాలుర ఫైనల్లో సరోజ్ సిరిల్ (జీటీటీఏ) 11-7, 8-11, 4-11, 11-4, 11-3, 11-3తో హర్ష్ లహోటి (హెచ్‌వీఎస్)పై నెగ్గారు.       

 

మరిన్ని వార్తలు