వడోదరా: మూడు వన్డేల సిరీస్లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన రెండో మ్యాచ్లో భారత్ 60 పరుగుల తేడాతో ఓటమి పాలై సిరీస్ను కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పూజా వస్త్రాకర్ కొట్టిన ఓ సిక్స్ స్కోరు బోర్డును చెల్లాచెదురు చేసింది. 40వ ఓవర్లో జోనాసెన్ వేసిన బంతిని ఎదుర్కొన్న పూజ.. దాన్ని సిక్స్ కొట్టింది. అది కాస్త బౌండరీ లైన్ ఆవల ఉన్న స్కోరు బోర్డుకు తాకింది. దీంతో స్కోరు బోర్డు చెల్లా చెదురైంది. దీనికి బౌలర్ జోనాసెన్ కూడా పూజాను అభినందించలేకుండా ఉండలేకపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులు చేసింది. 288 పరుగుల విజయ లక్ష్యంతో భారత్ బరిలోకి దిగి ఓటమి పాలైంది. దాంతో మరో మ్యాచ్ ఉండగానే భారత మహిళల జట్టు సిరీస్ను కోల్పోయింది.