ప్రాంజల ఓటమి

2 May, 2019 15:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం తొపలోవా (బల్గేరియా)తో జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రాంజల తొలి సెట్‌ను 3–6తో చేజార్చుకుంది. అనంతరం రెండో సెట్‌ను 6–0తో గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్‌లో స్కోరు 3–4 వద్ద ఉన్న దశలో ప్రాంజల గాయం కారణంగా వైదొలిగింది.

మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సౌజన్య భవిశెట్టి (భారత్‌)–ఇలోనా (రొమేనియా) జంటకు తమ ప్రత్యర్థి జంట నుంచి వాకోవర్‌ లభించింది. ఇదే వేదికపై జరుగుతున్న పురుషుల టోర్నీలో తొలి రౌండ్‌లో హైదరాబాద్‌ ఆటగాడు రిషభ్‌ అగర్వాల్‌ 2–6, 1–6తో టిమ్‌ వాన్‌ రిజ్తోవిన్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో ఓడిపోయాడు.  

మరిన్ని వార్తలు