ప్రాంజలకు మిశ్రమ ఫలితాలు

7 Dec, 2017 10:44 IST|Sakshi

ఐటీఎఫ్‌ టెన్నిస్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సంఘం (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. షోలాపూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో డబుల్స్‌ విభాగంలో సెమీస్‌కు చేరిన ప్రాంజల... సింగిల్స్‌ విభాగంలో ప్రిక్వార్టర్స్‌లో పరాజయం పాలైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్‌ ప్రాంజల 6–7 (3/7), 7–5, 2–6తో బున్వయి థాంచవత్‌ (థాయ్‌లాండ్‌ ) చేతిలో ఓడిపోయింది.

డబుల్స్‌ క్వార్టర్స్‌లో ప్రాంజల (భారత్‌)–చింగ్‌ వెన్‌ సు (చైనీస్‌ తైపీ) ద్వయం 6–1, 7–6 (7/4)తో జియాక్సిన్‌ కోంగ్‌–జియాకంగ్‌ (చైనా) జంటపై గెలుపొందింది. మరో క్వార్టర్స్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన సామ సాత్విక–షేక్‌ హుమేరా బేగం జంట 1–6, 5–7తో అలెగ్జాండ్రా గ్రించిషినా (కజకిస్తాన్‌)–అల్బినా ఖబిబులినా (ఉజ్బెకిస్తాన్‌) జోడీ చేతిలో ఓటమి పాలైంది.   

మరిన్ని వార్తలు