ప్రాంజల జోడీ ఓటమి

9 Mar, 2018 10:29 IST|Sakshi

ఐటీఎఫ్‌ మహిళల టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల పోరాటం ముగిసింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె డబుల్స్‌ విభాగంలో సెమీస్‌లో ఓటమి పాలైంది.

గురువారం జరిగిన మహిళల డబుల్స్‌ సెమీస్‌లో రెండో సీడ్‌ ప్రాంజల–ఎమిలీ వెబ్లీ (బ్రిటన్‌) జంట 3-6, 6-4, 7-10తో నాలుగో సీడ్‌ కనిక వైద్య (భారత్‌)–రోసెల్‌ వాన్‌ డెర్‌ హోక్‌ (నెదర్లాండ్స్‌) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది.   

మరిన్ని వార్తలు