సెమీస్‌లో ఓడిన ప్రాంజల

30 Sep, 2017 10:44 IST|Sakshi

ఐటీఎఫ్‌ టెన్నిస్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల పోరాటం సెమీస్‌లో ముగిసింది. థాయ్‌లాండ్‌లోని హువహిన్‌ పట్టణంలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆమె క్వాలిఫయర్‌గా అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన సింగిల్స్‌ సెమీఫైనల్లో ఈ హైదరాబాద్‌ క్రీడాకారిణి 4–6, 1–6తో రెండో సీడ్‌ జాక్వెలిన్‌ కకొ (అమెరికా) చేతిలో పరాజయం చవిచూసింది.  

మరిన్ని వార్తలు