టైటిల్‌పోరుకు ప్రాంజల జోడి

15 Sep, 2017 10:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్‌ ఫైనల్‌కు చేరుకుంది. థాయ్‌లాండ్‌లో గురువారం జరిగిన ఈ టోర్నీ మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో ప్రాంజల– జీల్‌ దేశాయ్‌ (భారత్‌) ద్వయం 6–2, 6–4తో కావో సికి– లి యువాన్‌ (చైనా) జంటపై గెలుపొందింది. ఫైనల్లో ప్రాంజల జోడీ భారత్‌కు చెందిన రితుజ భోస్లే– అలెగ్జాండ్రా వాల్టర్‌ (అమెరికా) జంటతో తలపడుతుంది.

మరిన్ని వార్తలు