షాంఘై (చైనా): ప్రపంచ వుషు (మార్షల్ ఆర్ట్స్) చాంపియన్షిప్లో భారత ప్లేయర్ ప్రవీణ్ కుమార్ స్వర్ణం గెలిచాడు. బుధవారం జరిగిన 48 కేజీల సాండా ఈవెంట్ ఫైనల్లో ప్రవీణ్ 2–1తో దియాజ్ (ఫిలిప్పీన్స్)పై నెగ్గాడు. మహిళల సాండా ఈవెంట్లో పూనమ్ (75 కేజీలు), సనతోయ్ దేవి (52 కేజీలు) రజతాలు... పురుషుల 60 కేజీల ఈవెంట్లో విక్రాంత్ కాంస్యం సాధించారు.