జీతురాయ్ ఇతర క్రీడాకారులకు రాష్ట్రపతి ప్రశంసలు

29 Jul, 2014 16:40 IST|Sakshi
జీతురాయ్ ఇతర క్రీడాకారులకు రాష్ట్రపతి ప్రశంసలు
న్యూఢిల్లీ: గ్రాస్గోవ్ లో జరుగుతున్న 20వ కామన్ వెల్త్ క్రీడల్లో పతకాలను సాధించిన క్రీడాకారులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం అభినందించారు. రాష్ట్రపతి అభినందించిన వారిలో జీతు రాయ్, గుర్పాల్ సింగ్, గగన్ నారంగ్ లు షూటింగ్, వికాస్ ఠాకూర్ కు వెయిట్ లిఫ్టింగ్ 85 కేజీల విభాగంలో  పతకాలు సాధించారు. 
 
కామన్ వెల్త్ లో భారతీయ పతాకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారులను రాష్ట్రపతి అభినందించినట్టు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ప్రణబ్ వ్యక్తిగతంగా సందేశాలు పంపారని అధికారులు తెలిపారు. జీతురాయ్ బంగారు, గుర్పాల్ సింగ్ రజత, నారంగ్ రజత పతకాలు సాధించారు. 
మరిన్ని వార్తలు