సొనేపట్: ప్రొ కబడ్డీ లీగ్లో శుక్రవారం ఆసక్తికరంగా జరిగిన రెండు మ్యాచ్లు కూడా ‘టై’ అయ్యాయి. ఇంటర్ జోన్ చాలెంజ్లో భాగంగా హర్యానా స్టీలర్స్, పట్నా పైరేట్స్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్ 41–41తో టైగా ముగి సింది.
అనంతరం గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, యూపీ యోధ జట్ల మధ్య పోటాపోటీగా జరిగిన ఈ మ్యాచ్ కూడా 30–30తో టై అయింది. నేడు జరిగే పోటీల్లో పట్నాతో యూ ముంబా, హర్యానాతో బెంగళూరు తలపడతాయి.